విద్యార్థులు, యువతలో నైపుణ్యాలను మెరుగుపరిచి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పారిశ్రామిక సంస్థల భాగస్వామ్యంతో నెలకొల్పిన యంగ్ ఇండియా తెలంగాణ స్కిల్స్ యూనివర్శిటీకి అదానీ గ్రూప్ రూ. 100 కోట్ల విరాళం అందించింది. అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ గౌతమ్ అదానీ గారి నేతృత్వంలోని అదానీ ఫౌండేషన్ ప్రతినిధి బృందం CM రేవంత్ రెడ్డిని కలిసి ఈ మేరకు చెక్కును అందజేశారు. నైపుణ్యాభివృద్ధి, యువత సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు నిరంతర మద్దతు ఉంటుందని గౌతమ్ అదానీ పేర్కొన్నారు. ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర అధికారులు కూడా ఉన్నారు.

Loading

By admin

error: Content is protected !!