ఉత్తరప్రదేశ్‌ కాన్పుర్‌లో కాళింది ఎక్స్‌ప్రెస్‌ రైలుకు పెను ప్రమాదం తప్పింది. ప్రయాగ్‌రాజ్‌ నుంచి భివానీ వెళ్తున్న రైలు శివరాజ్‌పుర్‌ వద్ద గ్యాస్‌ సిలిండర్‌ను ఢీకొట్టింది. లోకోపైలట్‌ ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును ఆపడంతో సిలిండర్‌ 50 మీటర్ల దూరంలో పడింది. ప్రమాదం జరగకపోవడం అదృష్టం. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌, ఫోరెన్సిక్‌ బృందం దర్యాప్తు చేపట్టగా, సిలిండర్‌, పెట్రోల్‌ బాటిల్‌ లభించాయి. రైలును పట్టాలు తప్పించేందుకు కొందరు కావాలనే చేసిన పని అని పోలీసులు అనుమానిస్తున్నారు.

Loading

By admin

error: Content is protected !!