తెలంగాణ మణిహారం రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగానికి (159 కి.మీ.) తక్షణ ఆమోదం కోరుతూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ గారిని కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు జాతీయ రహదారుల ప్రాజెక్టుల వివరాలు అందజేసి వాటికి సత్వర ఆమోదం కోరారు.
ప్రధాన అంశాలు:
- ఎన్.హెచ్-765 అభివృద్ధి:
శ్రీశైలంను హైదరాబాద్తో అనుసంధానించే ఎన్.హెచ్-765లో మిగిలిన 62 కిలోమీటర్లలో నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి 2024-25 బడ్జెట్లో నిధులు కేటాయించాలని విజ్ఞప్తి.
హైదరాబాదు–ప్రకాశం మధ్య 45 కి.మీ. దూరం తగ్గే అవకాశం.
- హైదరాబాద్-విజయవాడ రహదారి విస్తరణ:
ఎన్.హెచ్-65ను 6 వరుసలుగా విస్తరించేందుకు డీపీఆర్ను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. - వరంగల్ దక్షిణ భాగం బైపాస్:
వరంగల్-హన్మకొండ నగరాల మధ్య నూతన బైపాస్ ప్రతిపాదన, నడుస్తున్న ఎన్.హెచ్-63కు అనుసంధానం ప్రస్తావన. - పర్వత మాల ప్రాజెక్ట్:
యాదాద్రి, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్, నల్గొండ హనుమాన్ కొండ ప్రాంతాల్లో రోప్ వే ఏర్పాటు ప్రతిపాదన.
కేంద్ర మంత్రిని కలిసినవారు:
ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, మల్లు రవి, సురేష్ షేట్కర్, పోరిక బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, గడ్డం వంశీ, రాయసాయం రఘురామిరెడ్డి, కడియం కావ్య, ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ ప్రాజెక్టుల అమలు రాష్ట్ర అభివృద్ధికి కీలకమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.