TwitterWhatsAppFacebookTelegramShare

మన చేత్త వల్ల ఎంతమంది పిల్లల ఆరోగ్యానికీ, భవిష్యత్తుకీ ముప్పు వస్తోందో ఎవరైనా ఆలోచించారా? ఈ సమస్య ఎక్కడో కాదు – మన హైదరాబాద్ నగరంలోనే తీవ్రమవుతోంది. జవహర్ నగర్‌లోని చెత్త డంపింగ్ యార్డు 339 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రతిరోజూ సుమారు 8,000 మెట్రిక్ టన్నుల చెత్త ఈ ప్రాంతంలో వేస్తున్నారు. ఒక నెలలో 20 రోజులకు లెక్క వేస్తే 1,67,561 మెట్రిక్ టన్నులు, దాదాపు 14,364 లారీలు ఈ ప్రాంతాన్ని చెత్తతో నింపుతున్నాయి.

ఇక్కడి పరిసరాల్లో సుమారు 18 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. కేవలం 300 మీటర్ల దూరంలో రాజీవ గృహాలు – 4,521 కుటుంబాలు, 700 మీటర్లకు KCR డబుల్ బెడ్‌రూం ఇండ్లు – 4,428 కుటుంబాలు, ఒక కిలోమీటరు దూరంలో ఇందిరమ్మ ఇండ్లు – 500 కుటుంబాలు నివసిస్తున్నాయి.

ప్రజల్లో అంచనా ప్రకారం 20% మంది పిల్లలే ఉండగలరని గణన. అంటే దాదాపు 40,000 పిల్లలు ఈ చెత్త ప్రభావాన్ని నిత్యం ఎదుర్కొంటున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితులు ప్రశ్నార్థకంగా మారాయి – వాయు కాలుష్యం వల్ల శ్వాస సంబంధిత రోగాలు, లంగ్ ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, స్కిన్ ప్రాబ్లమ్స్ వంటి సమస్యలు ఉదయించాయి.మన చెత్త వల్ల ఒక తరానికి విద్య, ఆరోగ్య భద్రత ముప్పులో పడితే – బాధ్యత ఎవరిది?
ప్రశ్న మనందరిదీ. పరిష్కారం కోసం చర్యలు కూడా మనదే. బాలల హక్కుల సంఘం ఆవేదన చెందుతూ డంపింగ్ యార్డ్ అక్కడి నుండి తరలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న అద్యక్షురాలు అనురాధరావు

బిక్కు బిక్కు మంటూ జీవనం...

Loading

By admin

error: Content is protected !!
Exit mobile version