హైదరాబాద్ మహానగరానికి తాగునీరు అందించే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-1లో భాగంగా కొండపాక పంపింగ్ స్టేషన్ వద్ద 3000 ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్కు 900 ఎంఎం డయా వాల్వులను అమర్చనున్నారు. ఈ పనులు 17.02.2025 సోమవారం ఉదయం 6 గంటల నుంచి 18.02.2025 మంగళవారం ఉదయం 6 గంటల వరకు కొనసాగుతాయి.
నీటి సరఫరా అంతరాయం కలిగే ప్రాంతాలు:
1. ఓ అండ్ ఎం డివిజన్-6
ఎస్.ఆర్.నగర్, సనత్నగర్, బోరబండ, ఎర్రగడ్డ, బంజారాహిల్స్, సోమాజిగూడ, ఫతేనగర్.
2. ఓ అండ్ ఎం డివిజన్-9
కూకట్పల్లి, వివేకానందనగర్, మూసాపేట్, భరత్నగర్, మోతీనగర్, కేపీహెచ్బీ, హస్మత్పేట్.
3. ఓ అండ్ ఎం డివిజన్-12
చింతల్, సుచిత్ర, జీడిమెట్ల, షాపూర్నగర్, భగత్సింగ్నగర్, జగద్గిరిగుట్ట.
4. ఓ అండ్ ఎం డివిజన్-13
అల్వాల్, మచ్చబొల్లారం, యాప్రాల్, చాణిక్యపురి, గౌతమ్నగర్.
5. ఓ అండ్ ఎం డివిజన్-14
చెర్లపల్లి, సాయిబాబా నగర్, రాధికా.
6. ఓ అండ్ ఎం డివిజన్-15
కొండాపూర్, మాదాపూర్ (కొన్ని ప్రాంతాలు).
7. ఓ అండ్ ఎం డివిజన్-17
హఫీజ్పేట్, మియాపూర్.
8. ఓ అండ్ ఎం డివిజన్-21
కొంపల్లి, తూంకుంట, దమ్మాయిగూడ, నాగారం.
9. ఓ అండ్ ఎం డివిజన్-22
నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతి నగర్, తెల్లాపూర్.
10. ట్రాన్స్ మిషన్ డివిజన్-4
ఎంఈఎస్, గన్ రాక్, హకీంపేట్ ఎయిర్ ఫోర్స్, సికింద్రాబాద్ కంటోన్మెంట్.
11. ఆర్ డబ్ల్యూఎస్ ఆఫ్ టేక్స్ ప్రాంతాలు
ప్రజ్ఞాపూర్ (గజ్వేల్), ఆలేర్ (భువనగిరి), ఘన్పూర్ (మేడ్చల్).
అందువల్ల, ప్రస్తావించిన ప్రాంతాల్లో నివసించే ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని అధికారులు కోరారు.