TwitterWhatsAppFacebookTelegramShare

వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, సంక్షేమం గల్లంతైందని మండిపడ్డారు. “రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక అరాచకం జరుగుతుందని, వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని” ఆరోపించారు. ప్రతిపక్ష నేతలు ప్రజల ధనాన్ని దోచుకుని జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు.

తిరుమల లడ్డూపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విషప్రచారం చేయడం సరికాదని సజ్జల అన్నారు. “టీడీపీ ఇచ్చిన సూపర్-6 హామీల్లో ఒక్కటి కూడా అమలు కాలేదు,” అని, ఐదు నెలల్లో ప్రభుత్వం రూ.53 వేల కోట్ల అప్పు చేసినట్టు తెలిపారు.త్వరలోనే ఎన్నికలు వచ్చే అవకాశముందని, వైసీపీ పటిష్టమైన కార్యకర్తలను సిద్ధం చేస్తోందని, రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో విజయం వైసీపీదేనని సజ్జల ధీమా వ్యక్తం చేశారు.

Loading

By admin

error: Content is protected !!
Exit mobile version