TwitterWhatsAppFacebookTelegramShare

సికింద్రాబాద్‌ పరిధిలోని బేగంపేట ప్రకాశ్‌నగర్‌లో 700 కిలోల కుళ్లిన చికెన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆహార భద్రత టాస్క్‌ఫోర్స్‌ అధికారులు ఇక్కడి బాలయ్య చికెన్ సెంటర్‌లో తనిఖీలు చేపట్టారు. మద్యం దుకాణాలకు చికెన్‌ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. కుళ్లిన కోడి మాంసం, కొవ్వు పదార్థాలు, కోడి ఎముకలకు కెమికల్స్ కలిపి ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, మద్యం దుకాణాలకు అమ్ముతున్నట్లుగా నిర్ధరించారు. అనంతరం అధికారులు చికెన్ సెంటర్‌ను సీజ్ చేశారు.

Loading

By admin

error: Content is protected !!
Exit mobile version