TwitterWhatsAppFacebookTelegramShare

ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని అంబేడ్కర్ కూడలిలో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన నషా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, విద్యార్థులు, మరియు స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొన్నారు. ర్యాలీ ద్వారా మద్యం, మత్తు పదార్థాల వాడకం వల్ల జరిగే దుష్ప్రభావాలను సొసైటీలోని ప్రజలకు తెలియజేయడం, యువతను ఆరోగ్యకరమైన జీవనశైలిలోకి మారాలని ప్రోత్సహించడం లక్ష్యంగా ర్యాలీ సాగింది. శాసనసభ్యులు హరీష్ బాబు మాట్లాడుతూ, మత్తు పదార్థాలు వినియోగించడం సమాజం, కుటుంబాల మీద తీవ్రమైన ప్రభావం చూపుతుందని, యువత ఈ సమస్యను ఎదుర్కొని విజయం సాధించాలని సూచించారు.

Loading

By admin

error: Content is protected !!
Exit mobile version